వీసాకు వచ్చే వాళ్లు సోషల్ మీడియా సెట్టింగ్స్ మార్చుకోవాలి : అమెరికా ఎంబసీ ఆదేశాలు

వీసాకు వచ్చే వాళ్లు సోషల్ మీడియా సెట్టింగ్స్ మార్చుకోవాలి : అమెరికా ఎంబసీ ఆదేశాలు

మీరు అమెరికా వీసా కోసం వెళుతున్నారా.. వీసా కోసం అప్లికేషన్ పెట్టుకున్నారా.. డాక్యుమెంట్లు కరెక్ట్ గానే చూసుకున్నారా.. ఇంత వరకు ఓకే.. ఇప్పుడు మరో కొత్త రూల్ తీసుకొచ్చింది ఇండియాలో అమెరికా రాయబార కార్యాలయం. మీకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నట్లయితే.. Facebook, instagram, X వంటి సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నట్లయితే.. ఈ కొత్త నిబంధన గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.. లేదంటే వీసా రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంతకీ ఆ కొత్త రూల్ ఏంటంటే..

అమెరికా వెళ్లేందుకు F, M లేదా J విసా కొరకు అప్లై చేసుకునే వాళ్లు సోషల్ మీడియా అకౌంట్లలో చేంజెస్ చేసుకోవాలని యూఎస్ ఎంబసీ సూచించింది. విసా పర్మిషన్ రావాలంటే తప్పనిసరిగా సోషల్ మీడియా సెట్టింగ్స్ ను ప్రైవేట్ నుంచి పబ్లిక్ కు మార్చుకవాల్సి ఉంటుందని తెలిపింది. 

ALSO READ | ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై చేతులెత్తేసిన రష్యా.. ఇరాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లేనా..?

సోషల్ మీడియా సెట్టింగ్స్ లో పబ్లిక్ కు మార్చుకోవడం వలన అభ్యర్థుల ఐడెంటిటీ ఈజీగా తెలుసుకోవచ్చునని, అమెరికా చట్టాల ప్రకారం వారికి యూఎస్ లోకి ప్రవేశం కల్పించాలా వద్దా అని సులువుగా నిర్ధారించవచ్చునని ఎంబసీ అధికారులు తెలిపారు. 

యూఎస్ వీసా కోసం అప్లై చేసుకుంటున్న అభ్యర్థులకు ఇటువంటి నిబంధనలు విధించడం కొత్తేం కాదు. 2019 నుంచి అప్లికెంట్స్ విసా ఫామ్ పైన తమ సోషల్ మీడియా యూజర్ నేమ్ ఇవ్వాలనే నిబంధన విధించింది. ఇమ్మిగ్రెంట్స్, నాన్ ఇమ్మిగ్రెంట్స్ అందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. 

ఈ ఇన్ఫర్మేషన్  విసా అప్లికేషన్ చెకింగ్, స్క్రీనింగ్ కు ఉపయోగపడుతుందని ఎంబసీ తెలిపింది. అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ సమాచారం ఆధారంగా.. యూఎస్ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందా అనే కోణంలో విసా ఫామ్ ను పరిశీలిస్తారు. 

ప్రతి విసా అప్లికేషన్ ను జాతీయ భద్రత కోణంలోనే చూస్తామని.. ఇది బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ కోసం బాగా ఉపయోగపడుతుందని ఎంబసీ కార్యాలయం  వివరణ  ఇచ్చింది.