గుడిహత్నూర్, వెలుగు: ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ టెన్త్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ స్టూడెంట్లకు సూచించారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలంలోని ఉమ్రి గిరిజన బాలికల ఆశ్రమ స్కూల్ను తనిఖీ చేశారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున విద్యార్థుల ఆరోగ్యం పట్ల టీచర్లు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
టెన్త్లో 10/10 జీపీఏ సాధిస్తే ఐఐటీ, జేఈఈ, నీట్వంటి ప్రతిష్టాత్మక కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ, గత ప్రశ్నపత్రాలను విద్యార్థులతో సాధన చేయించాలని టీచర్లను ఆదేశించారు. అంతకుముందు పాఠశాలలోని స్టాక్రూమ్, డైట్మెనూ, కంప్యూటర్ ల్యాబ్, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. హెచ్ఎం భోజన్న సిబ్బంది ఉన్నారు.
