కానిస్టేబుళ్లుగా ఎంపికైన పీయూ స్టూడెంట్స్​

కానిస్టేబుళ్లుగా ఎంపికైన పీయూ స్టూడెంట్స్​

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: కానిస్టేబుళ్లుగా ఎంపికైన 40 మంది పీయూ విద్యార్థులను వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ అభినందించారు. శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్​ బిల్డింగ్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించి, ఉద్యోగాల్లో రాణించాలని సూచించారు. నిజాయితీగా, సేవా భావంతో పని చేయాలన్నారు.

 లైబ్రరీలో సివిల్స్ కి ప్రిపేర్  అయ్యే అభ్యర్థులకు స్టడీ సర్కిల్  ద్వారా కోచింగ్ ఇప్పిస్తామని తెలిపారు. ప్రొ. పిండి పవన్ కుమార్, జేడీ డా.మధుసూదన్ రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ డా. చంద్ర కిరణ్, స్టడీ సెంటర్  డైరెక్టర్ డా. భూమయ్య, వార్డన్  సంధ్యారాణి, లెక్చరర్లు రవికుమార్, శ్రీధర్ రెడ్డి, రామ్మోహన్, సిద్ధరాం గౌడ్, అయేషా, హస్మి పాల్గొన్నారు.