
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్.. ఆ శాఖకు సంబంధించి రోజువారి మీడియా వ్యవహారాలు నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలు చేపట్టిన ఫస్ట్ ఇండియన్ అమెరికన్గా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ సెలవుల్లో ఉండడంతో 33 ఏళ్ల పటేల్కు మీడియా వ్యవహారాల బాధ్యత అప్పగిం చారు. దీంతో ఆయన మంగళవారం విదేశాంగ విభాగంలో మొదటిసారిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ, లిజ్ ట్రస్ యూకే ప్రధాని అవడం, ఇరాన్ న్యూక్లి యర్ అంశాలపై ఆయన మాట్లడారు. కాగా, మీడియా వ్యవహారాల బాధ్యత చేపట్టిన పటేల్కు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.