
- డీఎఫ్వో శివ్ ఆశిష్ సింగ్
జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ నుంచి భారీ వాహనాల రాకపోకలపై విధించిన అంక్షలను ప్రభుత్వం ఎత్తివేసిందని మంచిర్యాల డీఎఫ్ వో శివ్ ఆశిష్సింగ్ తెలిపారు. సోమవారం రాత్రి జన్నారంలోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ నెల 4న హైదారాబాద్లోని అరణ్య భవన్లో జరిగిన వైల్డ్ లైఫ్ బోర్టు మీటింగ్లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పీసీసీఎఫ్ సువర్ణ, స్టేట్ వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఎలుసింగ్ మేరుతో పాటు వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలిసి వాహనాల అనుమతిపై సుదీర్ఘంగా చర్చించారని, అనుమతులిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
టైగర్ జోన్ పరిధిలో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనాల రాకపోకలకు అనుమతులిచ్చిందన్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ట్రాన్స్ పోర్టు వాహనాలకు రూ.150, జీపులకు, కార్లకు చెక్ పోస్టుల వద్ద ఎంట్రీ ఫీజు ఉంటుందని తెలిపారు. జన్నారం ఇన్చార్జ్ ఎఫ్ఆర్వో సుస్మారావు, ఇందన్పల్లి రేంజ్ ఆఫీసర్ శ్రీధర్ చారీ, బెల్లంపల్లి రేంజ్ ఆఫీసర్లు దయాకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.