నారాయణపేట జిల్లా కృష్ణా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్

నారాయణపేట జిల్లా కృష్ణా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్

మాగనూర్,వెలుగు :  నారాయణపేట జిల్లా కృష్ణా బ్రిడ్జి మీదుగా రాయచూర్ కి వాహనాల రాకపోకలను బంద్  చేస్తున్నట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. కృష్ణా బ్రిడ్జికి రిపేర్లు చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులోభాగంగా హైవే 167 రహదారిని 45 రోజుల పాటు బంద్ చేస్తున్నట్లు చెప్పారు.

కృష్ణా, మక్తల్, మరికల్  పోలీస్ స్టేషన్ల పరిధిలోని వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయచూర్ కి వెళ్లేవారు మరికల్  సబ్ స్టేషన్  నుంచి చిత్తనూరు, అమరచింత, జూరాల డ్యాం, గద్వాల్, కేటీదొడ్డి మీదుగా వెళ్లాలని సూచించారు. వాహనదారులు సహకరించాలని కోరారు.