- వేములవాడలో కేసు నమోదు
వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొంత కాలంగా జ్యోతిష్యం చెబుతున్న ఓ పూజారి పలువురి వద్ద రూ.2 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. దీంతో అప్పులిచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని మార్కండేయనగర్ వీధిలో ఓ జ్యోతిష్యాలయం నిర్వహించే మహేశ్ పూజారిగా కూడా పనిచేస్తున్నాడు.
తన దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేవారితో పాటు పలువురి ఇండ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు. తాను పలు బిజినెస్లలో పెట్టుబడులు పెడుతున్నానని, అధిక వడ్డీలు ఇస్తానని ఆశ చూపి పలువురి వద్ద రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. కొద్ది రోజులుగా జ్యోతిష్యాలయం మూసి ఉండడంతో పాటు ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
దీంతో అప్పులిచ్చిన వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ సీఐ వీరా ప్రసాద్ చెప్పారు.