
సిద్దిపేట రూరల్, వెలుగు: మండలాల్లో ఎక్కడ ఇసుక నిల్వలు ఉన్నాయో వెరిఫై చేసుకొని, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక పంపిణీకి టోకెన్స్ ఇవ్వాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని మోయతుమ్మెద, కూడవెల్లి వాగులతో పాటు వాటి ఉప కాల్వల్లో ఇసుక నిల్వలు ఉన్న మండలాల్లో ఎలాంటి సమస్య లేదన్నారు. మిగతా మండలాల్లోనూ వాగుల్లో ఇసుక తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇసుక కావాలని ఎంపీడీవోలు, తహసీల్దార్లకు రిక్వెస్ట్ పెట్టుకోవాలని, ఇసుక స్లిప్ లు తప్పనిసరిగా ట్రాక్టర్ వద్ద ఉండాలని, ఎక్కడైనా అక్రమంగా తరలిస్తే సీజ్ చేయాలని చెప్పారు. జిల్లాలో వనమహోత్సవం లక్ష్యాన్ని పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని పేర్కొన్నారు.
పర్మిషన్లేకుండా లీవ్పెడితే చర్యలు
కోహెడ, వెలుగు: పీహెచ్సీల్లో మెడికల్ఆఫీసర్లు, స్టాఫ్ముందస్తు పర్మిషన్లేకుండా లీవ్ పెడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్హైమావతి హెచ్చరించారు. శుక్రవారం కోహెడ పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెడికల్ఆఫీసర్, ముగ్గురు సిబ్బంది కేవలం లీవ్లెటర్లు పెట్టి వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఔట్పేషంట్లు, వారికిచ్చే మెడిసిన్వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. అనంతరం శనిగరం హైస్కూల్ను సందర్శించారు. స్టూడెంట్స్తో తెలుగు పద్యాలు చెప్పించారు.
తంగళ్లపల్లి, శనిగరంలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇండ్లు మంజూరైనా కట్టుకోవడానికి సుముఖత లేని వారి నుంచి లెటర్తీసుకొని, అర్హులైన ఇతరులకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్స్కూల్నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించారు. చెట్లు, పొదలను తొలగించాలని సూచించారు. ఇతరుల కాబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి, హద్దులు ఏర్పాటు చేయాలని, కబ్జాదారులకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు.
హెలిప్యాడ్ స్థల పరిశీలన
గవర్నర్ జిష్టుదేవ్వర్మ త్వరలో కోహెడకు రానున్న నేపథ్యంలో కలెక్టర్ హైమావతి స్థానిక లక్ష్మి గార్డెన్పక్కనున్న స్థలాన్ని హెలిప్యాడ్ కోసం పరిశీలించారు. పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్అహ్మద్ఖాన్, ఎంపీడీవో కృష్ణయ్య తదితరులున్నారు.