కాంగ్రెస్(ఎం) సీనియర్ నేత మృతి

కాంగ్రెస్(ఎం) సీనియర్ నేత మృతి

ప్రముఖ రాజకీయవేత్త, కేరళ కాంగ్రెస్ (ఎం) వ్యవస్థాకుడు కె.ఎం. మణి మృతి చెందారు. గత కొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన… ఈ రోజు కొచ్చిలోని లోకేషర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  మరణించారు. అతని వయస్సు 86 ఏళ్లు.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన మణి.. రాజకీయాల్లో చేరి, కేరళ అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టర్ గా పని చేశారు. అసెంబ్లీలో అత్యధిక సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. దాదాపు 50 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న మణి.. ఈ సారి లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నెల 23 న జరిగే లోక్ సభ ఎన్నికల్లో మణి పోటీ చేయాలనున్నారు. అయితే అనారోగ్యంతో  ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు మరణించారు.