ఎమ్మెల్యే మేడిపల్లి చొరవతో..నేతకార్మికుడిపై విజిలెన్స్ కేసు ఎత్తివేత

ఎమ్మెల్యే మేడిపల్లి చొరవతో..నేతకార్మికుడిపై విజిలెన్స్ కేసు ఎత్తివేత

గంగాధర/చొప్పదండి, వెలుగు: గంగాధర మండలం గర్శకుర్తిలో విజిలెన్స్ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు వారం కింద సీజ్​ చేసి, పవర్​లూమ్స్‌‌‌‌‌‌‌‌పై నమోదు చేసిన కేసును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో అధికారులు ఎత్తేశారు. బుధవారం గర్శకుర్తిలోని విజిలెన్స్‌‌‌‌‌‌‌‌ దాడిచేసిన పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూమ్స్‌‌‌‌‌‌‌‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. 

అనంతరం చేనేత కార్మికుడిపై అధికారులు పెట్టిన కేసులు ఎత్తివేయాలని, సీజ్ చేసిన పవర్​లూమ్స్​తిరిగి పునరుద్ధరించాలని చేనేత, జౌళి శాఖ కమిషనర్​ శైలజారామయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫోన్‌‌‌‌‌‌‌‌ చేసి కోరారు. కమిషనర్​ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు కేసులను ఎత్తేసి, సీజ్ చేసిన పవర్​లూమ్స్​ను తిరిగి పునరుద్ధరించారు. అంతకుముందు గర్శకుర్తికి చెందిన కొట్టపల్లి స్రవంతి క్యాన్సర్​తో చనిపోగా.. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రూ.50 వేలు చెక్కు అందజేశారు. 

నారాయణపూర్​ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంపునకు గురవుతున్న తమకు పరిహారం అందజేసి ఆదుకోవాలని చెర్లపల్లి(ఎన్) గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి మొరపెట్టుకున్నారు. చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్యే సత్యం పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుండడంతో పండగ వాతావరణం నెలకొందన్నారు.