- డీటైల్డ్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు
- బ్యారేజీని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ గాలికి
- ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గానీ, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ గానీ పట్టించుకోలే
- కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత తనిఖీలు కూడా చేయలే
- నిర్మాణ ఖర్చును ఏకంగా 133.67% పెంచేశారు
- వందేండ్ల కింద కట్టిన డ్యాములూ గట్టిగున్నా మేడిగడ్డ నాలుగేండ్లకే ఆగం
హైదరాబాద్, వెలుగు: డిజైన్, నిర్మాణం, నిర్వహణ తీరే మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమని విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చిచెప్పింది. బ్యారేజీ 7వ బ్లాక్లోని 16 నుంచి 21వ పిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయని, 20వ పిల్లర్లో పునాదుల నుంచే పగుళ్లు ఉన్నాయని వెల్లడించింది. 6, 7, 8 బ్లాకులను నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కాకుండా సబ్ కాంట్రాక్టర్ నిర్మించారని తెలిపింది. ఆ బ్లాకుల్లోనే ఎక్కువగా లోపాలున్నాయని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై 14 పేజీలతో కూడిన ప్రిలిమినరీ రిపోర్టును విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్అధికారులు గురువారం ప్రభుత్వానికి అందజేశారు. బ్యారేజీ వైఫల్యానికి గల పూర్తి కారణాలు అన్వేషించడానికి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. మేడిగడ్డ బ్యారేజీని 2019 జూన్19న అప్పటి సీఎం ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్పనులను ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గానీ, అటు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ గానీ చేపట్టలేదని విజిలెన్స్ తన రిపోర్టులో పేర్కొంది. 2019 –-20లోనే బ్యారేజీకి దిగువన కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి ఆప్రాన్దెబ్బతిందని, దీంతో బ్యారేజీ దిగువన ఇసుక జారిపోయిందని, కొట్టుకుపోయిన బ్లాకులను యథాస్థానంలో ఏర్పాటు చేయలేదని గుర్తించింది.
ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల ప్రకారం.. ప్రాజెక్టు ఓనర్గా ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లు వర్షాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత బ్యారేజీ వద్ద తనిఖీలు నిర్వహించి ఏవైనా లోపాలు ఉంటే సరి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి తనిఖీలేవి చేయలేదని పేర్కొంది.
బ్యారేజీ వ్యయాన్ని 133.67% పెంచారు
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి 2016లో రూ.1,853.31 కోట్లతో టెండర్లు పిలువగా.. ఎల్అండ్టీ – పీఎఈఎస్ జాయింట్ వెంచర్ 2.7 శాతం ఎక్సెక్స్కు కోట్చేసి పనులు దక్కించుకున్నాయని, బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని 2018లో రూ.3,065.4 కోట్లకు పెంచారని, 2021లో రూ.4,321.44 కోట్లకు పెంచారని నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తెలిపింది. మొత్తంగా 133.67 శాతం బ్యారేజీ నిర్మాణ వ్యయం పెంచేశారని పేర్కొంది.
నాలుగేండ్లకే ఫెయిల్
స్టేట్ డ్యామ్ స్టేఫీ ఆర్గనైజేషన్(ఎస్ డీఎస్వో) యాన్యువల్ రిపోర్టు 2022 –23 లోని అనెగ్జర్–7 ప్రకారం.. రాష్ట్రంలోని 65 డ్యాములను నిర్మించి 50 ఏండ్ల నుంచి వందేండ్లు అవుతున్నదని, అవన్నీ పటిష్టంగా ఉన్నాయని, మేడిగడ్డ మాత్రం నాలుగేండ్లకే ఫెయిలైందని పేర్కొంది. మేడిగడ్డ కుంగిన తర్వాత దాన్ని ఎన్డీఎస్ఏలోని ఆరుగురు నిపుణుల కమిటీ పరిశీలించిందని, బ్యారేజీ వైఫల్యానికి కారణాలు అన్వేషించడానికి వాళ్లు 20 రకాల రిపోర్టులు అడిగితే రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు 11 మాత్రమే సమర్పించారని వెల్లడించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు, తర్వాత చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్టులు, వర్క్కంప్లీషన్, క్వాలిటీ కంట్రోల్ లాంటి రిపోర్టులు కూడా అందజేయలేదని తప్పుబట్టింది. కాంట్రాక్టర్తో చేసుకున్న అగ్రిమెంట్కండీషన్లను ఇంజనీర్లు, సంబంధిత ఏజెన్సీ కూడా అతిక్రమించిందని పేర్కొంది.
టార్గెట్లో 18.04 శాతమే లిఫ్ట్
మేడిగడ్డ నుంచి ఒక్కో వాటర్ ఇయర్లో 180 టీఎంసీలను లిఫ్ట్ చేయాల్సి ఉండగా 2019 –20 నుంచి 2023 –24 వరకు 162.36 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేశారని, ఇది మొత్తం టార్గెట్లో 18.04 శాతమేనని రిపోర్టులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తెలిపింది.
రిపోర్టులో ఇంకా ఏముందంటే..!
- బ్యారేజీ నిర్మాణ సమయంలో నిర్మించిన కాఫర్డ్యాం (మట్టికట్ట), దానికి రక్షణగా నిర్మించిన షీట్ఫైల్స్ఐదేండ్ల వరకు తొలగించలేదు. దీంతో గోదావరి ప్రవాహానికి అది అడ్డుగా నిలిచి బ్యారేజీపై వరద ఒత్తిడి అధికంగా పడింది. దీంతో బ్యారేజీ ఆపరేషన్లోనూ సమస్యలు తలెత్తాయి.
- బ్యారేజీ రాఫ్ట్ ఫౌండేషన్, దానికి దిగునవ కటాఫ్వాల్స్ నిర్మాణం డ్రాయింగ్స్ ప్రకారం కనెక్ట్చేయాల్సి ఉన్నా.. ఆ పనులు సరిగా చేయలేదు. రాఫ్ట్ ఫౌండేషన్కు ఎగువ, దిగువన సికంట్ఫైల్స్ఏర్పాటు చేశారు. వీటిలో ప్రైపరీ ఫైల్స్ దెబ్బతిని ఫౌండేషన్ కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి ఉండొచ్చు. ఏడో బ్లాక్లోని 16 నుంచి 21 వరకు పిల్లర్లను పరిశీలిస్తే రాఫ్ట్ ఫౌండేషన్ విఫమైనట్టు తెలుస్తున్నది.
- కొట్టుకుపోయిన సీసీ బ్లాకులు, వియరింగ్ కోట్స్సహా ఇతర దెబ్బతిన్న వాటిని రిపేర్ చేయాలని వర్క్ ఏజెన్సీకి 2020 మే 18న ప్రాజెక్టు ఇంజనీర్లు లేఖ రాశారు. 2021 ఫిబ్రవరి 2న, 2022 ఏప్రిల్6న రిపేర్లు చేపట్టాలని మళ్లీ కోరారు. 2023 ఏప్రిల్28న ఏడో బ్లాక్లోని 17, 18, 19, 20 వెంట్స్వద్ద ఏర్పడ్డ బుంగలను గ్రౌంటింగ్ చేయాలని సంస్థకు సూచించినా ఎల్అండ్టీ రిపేర్లు చేయలేదు.
- ఏడో బ్లాక్ నిర్మాణం నిర్దేశిత పద్ధతుల ప్రకారం చేపట్టలేదు. రాఫ్ట్ ఫౌండేషన్ దానికి ఎగువ, దిగువన ఏర్పాటు చేసిన సికెంట్ఫైల్స్ను క్రమబద్ధతిలో అమర్చలేదు. బ్యారేజీ ఎం బుక్ల పరిశీలనలో ఈ విషయం స్పష్టంగా తేలింది. ఏడో బ్లాక్ నిర్మాణానికి సంబంధించి అనుమతించిన డిజైన్లలో పనులు చేయకుండా ఎన్నో ఉల్లంఘనలు జరిగినా ఉన్నతాధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టలేదు.
- బ్యారేజీ ఎగువన, దిగువన పేరుకుపోయిన మట్టి సహా ఇతర వ్యర్థాలను ఐదేండ్లుగా నిర్మూలించలేదు. బ్యారేజీపై ఎలాంటి ప్రభావం పడుతుందనే త్రీడీ మోడల్ స్టడీస్ కూడా చేపట్టలేదు.
- బ్యారేజీ నిర్మాణ అగ్రిమెంట్ కండిషన్ నం.50 ప్రకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయలేదు. అయినా బ్యారేజీ పనులు పూర్తి చేసినట్టుగా ఇంజనీర్లు వర్క్ కంప్లీషన్స్సర్టిఫికెట్లు జారీ చేశారు. 6, 7, 8 బ్లాకులను ఎల్అండ్టీ సబ్ కాంట్రాక్టర్కు ఇచ్చారు. ఆ సంస్థకు ఎలా పేమెంట్ చేశారనే దానిపై సమగ్ర విచారణ జరపాలి.
- బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకున్న 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబులిటీ పీరియడ్ ప్రారంభమైందని సర్టిఫికెట్ ఇచ్చారు.కాంట్రాక్టర్బ్యాంక్ గ్యారంటీలను రిలీజ్ చేయాలని ఆదేశిస్తూ రామగుండం ఈఎన్సీ అదే ఏడాది నవంబర్11న లేఖ రాశారు. ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి (విజిలెన్స్ సిఫార్సు మేరకే.. ఈఎన్సీ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం టెర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసింది).
- ప్రాణహిత –- చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైనింగ్ చేయడంతో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి మధ్య ఖర్చు చేసిన రూ.1,066.20 కోట్లు వృథా అయ్యాయి. అక్కడ పనులు చేపట్టేందుకు రూ.740.21 కోట్లతో కొనుగోలు చేసిన మెటీరియల్ను కాళేశ్వరం ప్రాజెక్టులో ఉపయోగించారు.
- మేడిగడ్డ బ్యారేజీలో పూర్తి లోటు పాట్లను స్టడీ చేయాల్సి ఉంది. ఇందుకు అవసరమైన బడ్జెట్రిలీజ్ చేయాలి. ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లను కాంట్రాక్టు పద్ధతిన నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలి.
- బ్యారేజీకి సంబంధించిన డిజైన్స్, డ్రాయింగ్స్, జియోలాజికల్ఇన్వెస్టిగేషన్స్, కాంక్రీట్ నిర్మాణాల పటిష్టతను అధ్యయనం చేయడానికి ఎక్స్పర్ట్కమిటీని నియమించి బ్యారేజీ ఫెయిల్యూర్స్పై సమగ్ర విచారణ జరిపించాలి.
కంప్లీట్ అయినట్లు చెప్పి మళ్లీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు
2019 సెప్టెంబర్10న పనులు పూర్తయినట్టుగా సబ్స్టాన్షియల్ కంప్లీషన్ సర్టిఫికెట్, 2021 మార్చి 3న వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లను కాంట్రాక్ట్ కంపెనీ ఎల్ అండ్ టీకి ఇంజనీర్లు ఇచ్చారని తెలిపింది. కంపెనీకి రూ.159.72 కోట్ల బ్యాంక్గ్యారంటీలను రిలీజ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. పనులు పూర్తయినట్టు సర్టిఫికెట్లు జారీ చేశాక కూడా ఈఎన్సీ 2022 మార్చి 31 వరకు ఎక్స్టెన్షన్ఆఫ్అగ్రిమెంట్టైమ్(ఈవోఏటీ) జారీ చేశారని, మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ఇంజనీర్రూ.280.61 కోట్ల రెండు బిల్లుల చెల్లింపునకు రికమండ్చేశారని గుర్తించింది.