PuriSethupathi: పూరి-సేతుపతి మూవీ.. హైదరాబాద్‌‌‌‌లో షూటింగ్ షురూ

PuriSethupathi: పూరి-సేతుపతి మూవీ.. హైదరాబాద్‌‌‌‌లో షూటింగ్ షురూ

విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను స్టార్ట్ చేశారు. ఇందులో నటిస్తున్న నటీనటులంతా ఈ షెడ్యూల్‌‌‌‌లో పాల్గొంటున్నారు.

హైదరాబాద్‌‌‌‌లో వేసిన భారీ సెట్‌‌‌‌లో  కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్ లేకుండా శరవేగంగా షూటింగ్ జరిగేలా ప్లాన్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా సెట్‌‌‌‌లో టీమ్ అంతా  కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.

సంయుక్త మీనన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న  ఈ చిత్రంలో టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ రావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.