హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా తమకు ప్రస్తుతం 164 స్టోర్లు ఉన్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 50 స్టోర్లను తెరుస్తామని, ఫర్నిచర్ కంపెనీ రాయల్ ఓక్ చైర్మన్ విజయ్ సుబ్రమణియం అన్నారు. హైదరాబాద్లోని నాచారంలో శనివారం కొత్త స్టోర్ఓపెన్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు తెలంగాణలో 28 స్టోర్లు ఉన్నాయని చెప్పారు. ‘‘మా ఫర్నిచర్ను పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని అమ్ముతాం. మంచి డిజైన్, క్వాలిటీ, తక్కువ ధరలు మా ప్రత్యేకత.
ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో మేం రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ సాధించాం. ఈసారి రూ.1,500 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నాం. మనదేశంలో ఫర్నిచర్ మార్కెట్సైజు26.8 బిలియన్ డాలర్లు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మాకు 25 శాతం మార్కెట్ వాటా ఉంది”అని ఆయన వివరించారు.