
- జనాలకు మరింత చేరువయ్యేందుకు సంస్థ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: నాణ్యమైన పప్పు దినుసులను జనాలకు మరింత చేరువ చేసేందుకు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ దాల్ను ఇక నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్, స్మార్ట్ బజార్లో అందుబాటులో ఉంచనున్నట్లు విజయలక్ష్మి దాల్ మిల్స్ సంస్థ తెలిపింది.
33 ఏండ్లుగా నాణ్యతతో కూడిన మినపప్పు, కందిపప్పు, పెసర పప్పు, శనగపప్పు, పుట్నాలు, ఇడ్లీరవ్వను అందిస్తూ జనాల ఆదరణను సంపాదించామని పేర్కొంది. నేరుగా పొలాల నుంచే పంటలను సేకరించి నాణ్యమైన, ఆరోగ్యవంతమైన, రుచికరమైన పప్పు దినుసులను అందిస్తున్నామని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.