వికారాబాద్, వెలుగు: సదరం సర్టిఫికెట్లు అర్హులైన వారందరికీ మంజూరయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సదరం క్యాంపుల నిర్వహణ, యూడీఐడీ పోర్టల్లో డేటా అప్లోడ్పై డీపీఎం, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. సదరం దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరిని క్యాంపులకు వచ్చేలా అధికారులు చొరవ చూపాలని స్పష్టం చేశారు.

