- రిసార్టులు, ఫామ్హౌస్లు, టూరిస్టు ప్లేసుల్లో పర్మిషన్తప్పనిసరి
- మైనర్లకు మద్యం సరఫరా చేస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న ఫామ్హౌస్లు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాల యజమానులు కొత్త సంవత్సర ఈవెంట్స్ నిర్వహిస్తే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని ఎస్పీ స్నేహా మెహ్రా హెచ్చరించారు. మంగళవారం తన ఆఫీసులో ఆమె మాట్లాడుతూ.. పోలీసులు సూచించిన టైమింగ్స్ కచ్చితంగా పాటించాలన్నారు. న్యూ ఇయర్వేడుకల్లో ఎక్కడా డీజే సిస్టమ్లకు అనుమతి ఇవ్వలేదన్నారు.
మైనర్లకు మద్యం సరఫరా చేస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యుత్సాహంతో అర్ధరాత్రి టూవీలర్లపై పెద్ద పెద్ద శబ్దాలతో న్యూసెన్స్చేసినా, ఈవ్ టీజింగ్కు పాల్పడినా చర్యలు తప్పవన్నారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తామని, దొరికతే కేసులు బుక్చేస్తామన్నారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఆఫీసర్లను నియమించామన్నారు.
