- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి
ఆర్మూర్, వెలుగు :- ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్మూర్ టౌన్లోని జర్నలిస్టు కాలనీ 19వ వార్డు, ఎన్టీఆర్ కాలనీ, 7వ వార్డులో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. టీయూఎఫ్ఐడీసీ, యూఐడీఎఫ్ నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్మూర్ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు.
ఆయన వెంట ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ విజయ్ అగర్వాల్, బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ దోండి రమణ, బత్తుల శ్రీనివాస్ గౌడ్, సుంకె శ్రీనివాస్, కొక్కెర భూమన్న, సత్యనారాయణగౌడ్, రాజేందర్ గౌడ్, గడ్డం శంకర్, దమ్మన్నస్వామి, అరుణ్, పులి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
