వింటేజ్ టూవీలర్..మ్యూజియం

వింటేజ్ టూవీలర్..మ్యూజియం

ఇప్పుడు టూవీలర్ అంటే బుల్లెట్, స్పోర్ట్స్​ బైక్స్, స్కూటీలు. కానీ, వీటికంటే ముందు స్కూటర్​, మోటార్​ సైకిల్​ వంటి పేర్లతో టూవీలర్స్ ఉండేవి. అవి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. అయితే, వాటిని రోడ్డు మీద చూడలేకపోవచ్చు. కానీ, మహారాష్ట్ర వెళ్తే మ్యూజియంలో చూడొచ్చు. టూవీలర్స్​కి కూడా మ్యూజియం ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా! 

ఆ విశేషాలు ఇవి...మహారాష్ట్రలోని పంచగామి, మహాబలేశ్వర్​ వెళ్లే రూట్​లో మెట్​గుటడ్​ అనే గ్రామం ఉంది. ఇది మహాబలేశ్వర్​కి సమీపంలో ఉంటుంది. ఈ ఊరిలోనే వింటేజ్ టూవీలర్​ మ్యూజియం ఉంది. దీన్ని పుణెకి చెందిన వినీత్​ కెంజలె మొదలుపెట్టాడు. ఈ మ్యూజియంలో 500లకు పైగా పాతకాలం నాటి టూవీలర్స్​ ఉన్నాయి. వాటిలో రకరకాల బ్రాండ్లు, వేర్వేరు మోడల్స్ ఉన్నాయి. విజయ్​ సూపర్, జావా, చేతక్, వెస్పా వంటి బ్రాండ్స్​ ఉన్నాయి​. మోడల్స్​ విషయానికొస్తే జావా బ్రాండ్​ మొదటి మోపెడ్​ టూవీలర్​, రాయల్ ఎన్​ఫీల్డ్​తో సహా చాలా రకాలున్నాయి.

అంతేకాదు.. బ్రిటిష్ సోల్జర్స్ వాడిన కైనటిక్​ లూనా, లాంబ్రెట్టా 59, రమోన1960, బిఎస్​ఎ బాండ్​ వంటి మొదటి మోనో షాక్​ సస్పెన్షన్​ బైక్​, హెర్క్యులస్  మోపెడ్​1967 వంటివి ఉన్నాయి. ఈ మ్యూజియం కోసం 1986లోనే ఆయా బ్రాండ్​ల బైక్​లు సేకరించాడట వినీత్. నాలుగు దశాబ్దాల తర్వాత 2021లో ఈ మ్యూజియాన్ని ప్రారంభించాడు. ఎంట్రీ ఫీజు ఒక్కరికి వంద రూపాయలు. 

‘‘ఎనభైల కాలంలో ఇండియాలో బైక్స్ తిరగడం చాలా ఇంట్రెస్టింగ్​గా ఉండేది. ప్రజలు పాత మోడల్స్ పక్కన పెట్టి కొత్తగా వచ్చిన బైక్స్ కొనడానికి ఎంతో కాలం పట్టలేదు. అది చూసి అప్పటివరకు వాడిన పాత బైక్స్​ అన్నీ ఏమయ్యాయి అని ఆలోచించా. అప్పటినుంచీ కనిపించకుండా పోయిన పాత బైక్​లను కలెక్ట్​ చేయడం మొదలుపెట్టా” అని చెప్పాడు వినీత్​. ఈ మ్యూజియంకి వచ్చే విజిటర్స్​ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ, ఈ పాత బైక్​లతో వాళ్లకున్న అనుభవాలను షేర్ చేసుకుంటున్నారట.