ఇదీ ఎండ అంటే : ఇసుకలో అప్పడం వేస్తే.. నూనె లేకుండానే వేగిపోయింది

ఇదీ ఎండ అంటే : ఇసుకలో అప్పడం వేస్తే.. నూనె లేకుండానే వేగిపోయింది

ఎండాకాలంలో జనాలు విచిత్రమైన ప్రయోగాలు చేస్తుంటారు.. బైక్​ సీటుపై దోసెలు.. ఆమ్లెట్లు వేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఫేమస్​ అవుతుంటారు.  మరి కొంతమంది సూర్యుడి ఎండ పడేలా అన్నం వండటం లాంటివి కూడా చూశాం.. కాని ఇప్పుడు తాజాగా ఓ భారతీయ సైనికుడు ఎండలో విధులు నిర్వహిస్తూ.. కాలిపోయే ఇసుకలో నూనె లేకుండా అప్పడాన్ని వేయించాడు.  ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. 

రాజస్థాన్‌లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎండ వేడిమి, కరెంటు కోతలతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక సరిహద్దు భద్రతా దళాల పరిస్థితి వర్ణనాతీతం. భానుడి ప్రతాపానిక్ బీఎస్పీ (BSF) సైనికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కింద ఇసుక, పైన వేడితో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్ ఎడారుల్లో వారి పరిస్థితి ఏంటో ఓ బీఎస్పీ సైనికుడు అందరికి తెలిసేలా ఓ వీడియోని విడుదల చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది.

రాజస్థాన్‌ బికనీర్‌లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఈ మండుతున్న వేడి మధ్య, సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికుడి వీడియో బయటపడింది. మండుతున్న వేడి ఇసుకలో పాపడ్ కాల్చడం అందర్నీ ఆలోచింపజేస్తుంది. పాపడ్ కేవలం కొన్ని సెకన్లలో ఉడికిపోతుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ అసాధారణ పరిస్థితులలో కూడా మనల్ని సురక్షితంగా ఉంచే మన సైనికుల పట్ల అపారమైన గౌరవం మరియు కృతజ్ఞతా భావాన్ని సృష్టించింది అని ఎక్స్ ద్వారా పంచుకున్నారు.

భారతీయ సైనికుడు ఇసుకలో అప్పడాన్ని కాల్చిన వీడియోపై నెటిజన్లు స్పందించారు.  ఈ వంటకం సరిగా లేదని.. ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉందని ఒకరు పోస్ట్​ చేయగా.. మరికొంతమంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో విధుదు నిర్వహిస్తున్న సైనికుడికి సెల్యూట్​ చేశారు.  చాలామంది నెటిజన్లు కామెంట్​ రూపంలో సైనికుడికి జైహింద్​ అన్నారు. 

రాష్ట్రంలోని జుంజును జిల్లా పిలానీలో  ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌ను దాటింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆదేశాల మేరకు డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, సబ్‌డివిజన్ అధికారులు, నీటి సరఫరా, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.