ఐపీఎల్ చరిత్రలో వింత.. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సేమ్ సేమ్

ఐపీఎల్ చరిత్రలో వింత.. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సేమ్ సేమ్

రికార్డులు సృష్టించడం వేరు.. వాటిని బద్దలు కొట్టడం వేరు.. క్రికెట్ లో ఇవన్నీ సర్వ సాధారణం అయిపోయాయి. అప్పుడప్పుడు కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరగడం కామన్. అయితే, ఒకే సీజన్ లో ఇలాంటి ఘటనలు జరగడం మాత్రం చాలా రేర్. అలాంటి ఘటనే ఈ ఐపీఎల్ 2023లో జరిగింది. 

విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ ఈ ఐపీఎల్ లో సేమ్ స్కోర్స్ చేయడం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆర్సీబీ తరుపున కోహ్లీ.. గుజరాత్ తరుపున గిల్ ఒకే స్కోరు సాధించారు. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన ఈ ఆటగాళ్లు 333 పరుగులు చేయడం గమనార్హం.

యాదృచ్ఛికంగా ఈ ఇద్దరు ఈ సీజన్ లో ఒకసారి డకౌట్ అయ్యారు. అయితే, కోహ్లీ మాత్రం 8 మ్యాచుల్లో 5 హాఫ్ సెంచరీలు చేయగా, గిల్ 3 హాప్ సెంచరీలు చేశారు.