IPL 2024: కింగ్ వచ్చేశాడు: బెంగళూరు క్యాంప్‌లో చేరిన కోహ్లీ

IPL 2024: కింగ్ వచ్చేశాడు: బెంగళూరు క్యాంప్‌లో చేరిన కోహ్లీ

ఆర్సీబీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ దాదాపు రెండు నెలల తర్వాత ఇండియాలో అడుగుపెట్టాడు. తన భార్య అనుష్క డెలివరీ కారణంగా ఇన్నాళ్లూ లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండిపోయిన అతను శనివారం (మార్చి 16) రాత్రి బెంగళూరుకు చేరుకున్నాడు. ఈ మేరకు కోహ్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకు వస్తున్న ఫొటోను ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఇదిలా ఉండగా తాజాగా కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు.

అతను ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాడు. ఇందులో భాగంగా కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారుతుంది. ఈ నెల 19న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కోహ్లీ పాల్గొంటాడు. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఇటీవల తమ జీవితంలోకి రెండో సంతానాన్ని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి  15న అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతనికి వారిద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా అకాయ్‌(Akaay) అని నామకరణం చేశారు.

ALSO READ :- గడువు ముగిసింది..Paytm FASTag ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయా..? PPBL సమాధానం ఇదిగో..

ఐపీఎల్ విషయానికి వస్తే కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ ను మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడుతుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇప్పటివరకు 16 సీజన్ లు ఆర్సీబీ ఖాతాలో ఒక్క టైటిల్ కూడా లేకపోవడం విచారకరం. మూడు సార్లు చేరినా టైటిల్ ఆ జట్టుకు అందని ద్రాక్షలా మిగిపోయింది. ప్రస్తుతం ఆటగాళ్లందరూ సూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ సారైనా టైటిల్ గెలవాలని ఆరాటపడుతుంది.