ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ... ఎమోషనల్ అయిన కోహ్లీ

ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ... ఎమోషనల్ అయిన కోహ్లీ

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంలో కీ రోల్ ప్లే చేసిన విరాట్ కోహ్లీ.. మ్యాచ్ అయిపోయాక ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేలపై పంచ్ లు ఇచ్చాడు. దీనిపై క్రికెటర్ హర్ష భోగ్లే  రియాక్ట్ అయ్యాడు. ‘‘ ఇంతవరకూ కోహ్లీ కళ్లల్లో కన్నీటి చుక్క చూడలేదు.. ఇదే తొలిసారి’’ అంటూ ట్వీట్  చేశాడు.  

రెండో ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ.. చివరి వరకు నిలబడి ఒంటి చేత్తో భారత్ కు విజయాన్ని అందించాడు. 8 బాల్స్ కు 28 పరుగులు రావాల్సి ఉండగా, 19వ ఓవర్ చివరి రెండు బాల్స్ లో రెండు సిక్సులు కొట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. మొత్తం 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. 

కోహ్లీని ఎత్తుకున్న రోహిత్ శర్మ

ఈ మ్యాచ్ లో విశ్వరూపం చూపించిన విరాట్ కోహ్లీని కెప్టెన్ రోహిత్ శర్మ తన భుజాలపై ఎత్తుకుని  సంతోషంగా తిప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సహచరులు కూడా కోహ్లీని  అభినందించారు.