ఆరేళ్లు పూర్తి చేసుకున్న విరుష్క జోడి.. ఈ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు

ఆరేళ్లు పూర్తి చేసుకున్న విరుష్క జోడి.. ఈ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ 2017 డిసెంబర్ 11 న వివాహం చేసుకున్నారు. నేటితో వీరి దాంపత్య జీవితానికి 6 సంవత్సరాలు. అభిమానులు వీరిని ముద్దుగా విరుష్క జోడీగా పిలుచుకుంటారు. 2021లో వీరికి వామిక అనే కుమార్తె జన్మించింది. ప్రస్తుతం వీరు తమ రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలోని వన్ ఆఫ్ ది టాప్ జోడీల్లో విరుష్క దంపతులు ఒకరు. కష్టకాలంలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మంచి జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

అనుష్క తనను మంచి వ్యక్తిగా మార్చిందని.. తన భాగస్వామి వలన ఒత్తిడిని ఎదర్కోగలిగానని.. విరాట్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. మరోవైపు, విరాట్ ఒక పోరాట యోధుడనీ.. అందంతో పాటు తన భర్తకు దేశాన్ని గెలిపించాలనే అంకితభావంతో ఉంటాడని.. కోహ్లీ దొరకడం అనుష్క తన అదృష్టంగా భావిస్తుంది. కుటుంబ బాధ్యతలను చూసుకోవడానికి అనుష్క తన నటనా జీవితాన్ని వెనుకకు నెట్టింది.  

అనుష్క శర్మ సినిమాలకు దూరంగా ఉండడటమే కాక, సినిమాలను పూర్తిగా చూడటం మానేసింది. వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్ లు చూస్తూ బిజీగా గడిపింది. ఐసీసీ ప్రపంచకప్ తర్వాత వీరిద్దరూ ఇటీవల లండన్‌ హాలిడేలో కనిపించారు. వివాహం అనంతరం కోహ్లీ బ్యాటర్ గా, కెప్టెన్ గా అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టుల్లో కోహ్లీ దూకుడు నెక్స్ట్ లెవల్లో సాగింది. ఇటీవలే వరల్డ్ కప్ లో వన్డేల్లో విరాట్  క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల(49) రికార్డ్ ను బ్రేక్ చేసి.. వన్డే చరిత్రలో 50 సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.