Aaryan Trailer: ఇన్వెస్టిగేషన్‌తో థ్రిల్ ఇస్తున్న ‘ఆర్యన్’ ట్రైలర్.. డార్క్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చేస్తున్న పర్ఫెక్ట్ సైకో క్రిమినల్

Aaryan Trailer: ఇన్వెస్టిగేషన్‌తో థ్రిల్ ఇస్తున్న ‘ఆర్యన్’ ట్రైలర్.. డార్క్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చేస్తున్న పర్ఫెక్ట్ సైకో క్రిమినల్

పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. తను హీరోగా రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ఎ పర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్. కె ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్ కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే శుక్రవారం (అక్టోబర్ 31న) తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఇవాళ ఆదివారం (అక్టోబర్ 19న) ఆర్యన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ హత్య దర్యాప్తుతో విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ సాగిన ట్రైలర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  తీసుకెళుతుంది. ఓ సైకో తాను ఎవరిని హత్య చేయబోతున్నాడో గంట ముందు అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మరీ మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాడు. ఆ గంటలోపు అతన్ని పట్టుకోగలగాలి.

పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తనదైన శైలిలో విష్ణు విశాల్ ఆకట్టుకున్నాడు. సైకో క్రిమినల్గా సెల్వరాఘవన్ పాత్ర ఇంటెన్స్ కలిగిస్తుంది. ఈ సైకో చేసేది పర్ఫెక్ట్ క్రైమ్ కాదు.. అతనే పర్ఫెక్ట్ క్రిమినల్ అనే చెప్పే డైలాగ్.. తనలోని మృగాన్ని చూపించేలా ఉంది. 

►ALSO READ | K-Ramp Box Office: ‘కె ర్యాంప్’ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

‘రాట్ససన్’ విజయం తర్వాత విష్ణు విశాల్ మరోసారి పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ ఉత్కంఠరేపే ఇన్వెస్టిగేషన్స్తో ఉన్నాయి. దీంతో తెలుగు ఆడియన్స్ థియటర్స్కు ఎగబడి ఛాన్స్ కనిపిస్తుంది. సినిమా క్లిక్ అయితే, విష్ణు విశాల్కి తెలుగులో మంచి క్యారెక్టర్స్ దక్కే ఛాన్స్ ఉంది. చూడాలి ఏమవుతుందో!

ఈ సినిమాలో సెల్వరాఘవన్తో పాటుగా శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్ అభిషేక్ జోసెఫ్ జార్జ్  ఇతర పాత్రలు పోషించారు. విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్’ చిత్ర  దర్శకుడు మను ఆనంద్ ఈ సినిమాకు కో రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నాడు. జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.