తల్లులకు వివేక్ వెంకటస్వామి మొక్కులు

తల్లులకు వివేక్ వెంకటస్వామి మొక్కులు

పెద్దపల్లి/వెల్గటూర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో వెలసిన సమ్మక్క, సారలమ్మ తల్లులను గురువారం బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్​ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. బంగారాన్ని తలమీద మోసుకెళ్లి తల్లులకు మొక్కులు చెల్లించారు. రాజారాంపల్లిలోని ఆలయ కమిటీ సభ్యులు వివేక్​వెంకటస్వామికి డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. వివేక్ తన ఎత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పించారు. తర్వాత పక్కనే కొత్తగా కడుతున్న ఎల్లమ్మ గుడి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో వివేక్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాజుల మల్లేశం, రాష్ట్ర బీజేపీ దళిత మోర్చా అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ, మంచే రాజేశ్, బీజేపీ నాయకులు సజ్జాద్, బాలసాని సతీశ్, సంతోష్, శ్యామ్, పవన్, నాగరాజ్, సదయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవార్లను కోరుకున్నట్లు వివేక్ వెంకటస్వామి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

ఆన్‌ లైన్‌లో లెర్నింగ్ లైసెన్స్.!

వరదలతో బ్రెజిల్ అతలాకుతలం.. 105 మంది మృతి

కేసీఆర్ పుట్టిన గడ్డపై నేనూ పుట్టడం గర్వంగా ఉంది