వివేక్​వెంకటస్వామి ఫొటోకు క్షీరాభిషేకం

వివేక్​వెంకటస్వామి ఫొటోకు క్షీరాభిషేకం

చెన్నూరు/జైపూర్(భీమారం)/కోల్​బెల్ట్, వెలుగు :  సింగరేణి మైన్లతో, జైపూర్ లోని సింగరేణి పవర్ ప్లాంట్ లో కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో 80 శాతం స్థానికులకే అవకాశం ఇచ్చేలా సర్క్యులర్ జారీకి కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్​వెంకటస్వామికి కోల్​బెల్ట్​వ్యాప్తంగా గురువారం కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు, జైపూర్, భీమారంలో, మందమర్రిలోని ఐఎన్టీయూసీ ఆఫీస్, ఇందు గార్డెన్స్, రామకృష్ణాపూర్​ కాంగ్రెస్​పార్టీ ఆఫీసులో వివేక్​తోపాటు సీఎం రేవంత్​రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.