కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ, పీజీ కాలేజీలో ఎంబీఏ చదువుకున్న 8 మంది విద్యార్థులు 11 గోల్డ్ మెడల్స్ సాధించారని ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ కాన్వొకేషన్ లో వారికి గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కాలేజీ కరస్పాండెంట్ వి.ఆగం రావు, ఏసీఓ బి. సంపత్ కుమార్, ఏవోబీ శ్రవణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సాగర్, హెచ్వోడీలు గోపికృష్ణ, సలీం అభినందించారు.శాతవాహన యూనివర్సిటీ కాన్వొకేషన్ లో ఆరుగురు శ్రీ చైతన్య విద్యార్థులు గోల్డ్ మెడల్స్ అందుకున్నట్లు చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారిని అభినందించారు.
