హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అధిక మెజారిటీ ఇవ్వాలి : వొడితల ప్రణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి అధిక మెజారిటీ ఇవ్వాలి : వొడితల ప్రణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హుజూరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీని అందించాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వొడితల ప్రణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిలుపునిచ్చారు. సోమవారం హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీలకు చెందిన పలువురు లీడర్లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. వారికి ప్రణవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీపీసీసీ కోఆర్డినేటర్ తవుటం రవీందర్, బాలసాని రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐలయ్య, చరణ్ పటేల్, భిక్షపతి, తిరుపతి పాల్గొన్నారు.

కాంగ్రెస్ లో చేరికలు

మల్లాపూర్ , వెలుగు: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వివిధ గ్రామాలకు చెందిన సుమారు 10 మంది బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు.. కోరుట్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. మల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో లీడర్లు కృష్ణారావు, ఎంపీటీసీలు శ్రీనివాస్ రెడ్డి , శ్రీను, మాజీ జడ్పీటీసీ తిరుపతిరెడ్డి, లీడర్లు బాపురెడ్డి, నందు, మహిపాల్, 
మల్లయ్య పాల్గొన్నారు.

వీణవంక, వెలుగు: వీణవంకలో జరిగిన కార్యక్రమంలో ఇతర పార్టీలకు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలు, కులసంఘాల నాయకులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి వొడితల ప్రణవ్, పీసీసీ సభ్యుడు కర్ర భగవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు కొమ్మిడి రాకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రఘుపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కొండారెడ్డి,  యాదగిరి, కొండల్ రెడ్డి, సునీల్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.