
వనపర్తి, వెలుగు: జిల్లాలో టోపోగ్రాఫికల్సర్వే పకడ్బందీగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో సర్వే ఆఫ్ ఇండియా నోడల్ అధికారి సురేశ్కుమార్ జిల్లాలోని మండల పరిషత్ స్టాటిస్టిక్స్ అధికారులు, సర్వేయర్లకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్కలెక్టర్మాట్లాడుతూ.. టోపోగ్రాఫికల్సర్వే జిల్లా నైసర్గిక స్వరూపాన్ని ఖచ్చితత్వంతో తెలుపుతుందన్నారు. ప్రొఫార్మాలోని అంశాలపై ఏ చిన్న అనుమానం ఉన్నా నోడల్ అధికారి వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు. జిల్లా ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాలకృష్ణ పాల్గొన్నారు.
సీఎంఆర్ త్వరగా అప్పగించాలి
సీఎంఆర్ త్వరగా అప్పగించాలని అడిషనల్కలెక్టర్వెంకటేశ్వర్లు మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం వనపర్తి మండలం కిష్టగిరిలోని లక్ష్మీనరసింహ ఇండస్ట్రీస్, కొత్తకోట మండలం మమ్మలపల్లిలోని రైతు ఆగ్రో ఇండస్ట్రీస్, సంకిరెడ్డిపల్లిలోని కొత్తం ఇండస్ట్రీస్ను సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్జగన్మోహన్, అసిస్టెంట్ మేనేజర్ బాలు నాయక్ తో కలిసి తనిఖీ చేశారు.