
దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తుంది. దట్టమైన పొగమంచుతో ఢిల్లీలోని రోడ్లు కనుమరుగయ్యాయి. చల్లని గాలులతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ అత్యంత దయనీయ స్థితికి పడిపోయింది. ఢిల్లీ ఉష్ణోగ్రతలు 3.3 డిగ్రీలకు పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. లోధి రోడ్లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు
అప్రమత్తమైన రైల్వే శాఖ పలు రైల్లను రద్దు చేసింది. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయని తెలపింది. విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి. 17 విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన చలి ఉంటుందని తెలిపింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 3.3 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.