
భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భద్రతను పెంచే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు వై కేటగిరీ భద్రత ఉండగా, అదనంగా జెడ్ కేటగిరీ భద్రతకూడా కల్పించనున్నారు.
పరిపాలనా స్థాయిలో చర్చల అనంతరం సీఎం మమత బెనర్జీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి రాగానే కోల్కతాలోని బెహాలా ప్రాంతంలోని ఆయన ఇంటి వద్ద 24 గంటల పాటు ఇద్దరు ప్రత్యేక భద్రతాధికారులు కాపలాగా ఉండనున్నారు. భద్రతా సిబ్బంది సంఖ్య సైతం పెంచున్నారు.