భారత వాయు సేన పాక్ పై దాడి చేసిందా?

భారత వాయు సేన పాక్ పై దాడి చేసిందా?

భారత వాయు సేన పాకిస్తాన్ పై దాడి చేసిందా అని అనుమానం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సలహాదారు శామ్‌ పిట్రోడా. ఇటివల భారత్‌ వాయుసేన పాకిస్తాన్ లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై చేసిన దాడిలో నిజాలపై ప్రశ్నించారు. వారు 300 మందిని చంపితే మంచిదే. కాకపోతే నేను అడిగేది ఒక్కటే.. దానికి సంబంధించి మరిన్ని ఆధారాలు, వాస్తవాలను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌, ఇతర పత్రికలు చదివానని.. అసలు మనం దాడి చేశామా..? 300 మందిని చంపామా..? నాకైతే తెలియదు అని అన్నారు. ఒక పౌరుడిగా అడిగే హక్కు ఉంది.. నేను అడుగుతాను. అంతమాత్రాన నేను ఇటు వైపో..అటు వైపో ఉన్నట్లు కాదు. మనకు మరిన్ని నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మీరు 300 మందిని చంపితే భారత ప్రజలకు తెలుసుకొనే హక్కు ఉంది. కానీ ప్రపంచ మీడియా మాత్రం అక్కడ ఎవరూ చనిపోలేదనే చెబుతోంది. ఒక భారతీయ పౌరుడిగా నాకు అది ఏమాత్రం బాగోలేదన్నారు శామ్‌ పిట్రోడా.

తాను గాంధేయ వాదినన్న పిట్రోడా… దయా, గౌరవం వంటి అంశాలను నమ్ముతానన్నారు. చర్చలపైనే  నమ్మకం ఉందని. అయితే అది పాక్ మాత్రమే ఎందుకు …మనం ప్రతిఒక్కరితో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచం మొత్తంతో చర్చించాలని…. ఇవన్నీ నా వ్యక్తిగతంగా అడుగుతున్నవేనని చెప్పుకొచ్చారు. ఒక శాస్త్రవేత్తగా అడుతున్నవేనన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పనితీరును శామ్‌ పిట్రోడా వెనుకేసుకొచ్చారు. చాలా మంది ప్రజలు ఆయన విషయంలో తప్పుగా అనుకొంటారు. చాలా సినిమాలు తీశారు. అదంతా కేవలం తప్పుడు ప్రచారమే. పుల్వామ తర్వాత ప్రస్తుత ప్రధాని మోడీ తీరును నేను వ్యతిరేకిస్తున్నా అని తెలిపారు శామ్‌ పిట్రోడా.