ఆ స్టేషనరీ షాపులో ఏం జరిగింది.. ఈ అమ్మాయికి ఎందుకిలా జరిగింది..!

ఆ స్టేషనరీ షాపులో ఏం జరిగింది.. ఈ అమ్మాయికి ఎందుకిలా జరిగింది..!

ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న వర్షా పవార్ తన స్కూల్ దగ్గర్లోని స్టేషనరీ షాపులో శవమై కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. కొన్ని రోజులుగా మిస్సింగ్ లో ఉన్న వర్షా శవమై కనిపించే సరికి స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వర్షా పవార్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్ ను నడుపుతూ బీజేపీ కార్యకర్తగా చాలా యాక్టీవ్ గా ఉండేదని పోలీసులు అన్నారు 

2024, ఫిబ్రవరి 24న వర్షా తండ్రి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారని చెప్పారు. వర్షా కనపడటం లేదని మిస్సింగ్ కేసు ఫైల్ చేశామని తెలిపారు. కొన్ని రోజుల స్కూల్ ఆవరణలోని ఓ మూత పడ్డ స్టేషనరీ షాపులో వర్షా శవమై తండ్రికి కనిపించిందని తమకు సమాచారం రావడంతో వెళ్లామని అన్నారు. వర్షా మెడపై గాయం గుర్తులు కనిపించాయని పోలీసులు చెప్పారు. వర్షా శవం చాలా రోజులుగా మూత పడి ఉన్న స్టేషనరీలోకి ఎలా వెళ్లిందనే దాని పై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. 

 వర్షాని అత్యాచారం చేసి గొంతు నొక్కి చంపారా అనే కోణంలో విచారణ చేపడుతున్నామని తెలిపారు. వర్షా తండ్రి మాట్లాడుతూ తన కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆరోపించారు. తన కూతురు మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.