ఫ్రాడ్ చేసేవాళ్లకు అనేక మార్గాలు ఉన్నాయి. ఒక విధంగా కుదరకపోతే మరో విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి.. టెక్నాలజీ వాడేవాళ్లంతా.. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. సైబర్ క్రైంల గురించి తెలుసుకోవాలి. అవి ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవరితో అయినా తెలివిగా ప్రవర్తించాలి. కొన్నిసార్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా మోసపోతుంటారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
- విమానాశ్రయాలతో సహా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను అస్సలు వాడొద్దు.
- పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడే బదులు పవర్ బ్యాంకులను వెంట తీసుకెళ్లాలి. వాటిని పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల నుంచి ఛార్జ్ చేసి, వాటితో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవాలి.
- యూఎస్బీ ద్వారా కనెక్ట్ చేసేటప్పుడు ఫోన్లో వచ్చే టాప్–అప్ ఆప్షన్లలో ఆటోమేటిక్ డేటా ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేయాలి.
- ఒకవేళ తప్పనిసరి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్ పెట్టాల్సి వస్తే.. కేవలం ఛార్జింగ్ చేయడానికి మాత్రమే పనికొచ్చే డాటా కేబుల్స్ని వాడాలి.
- ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులకు మీ అడ్రస్, ఆర్థిక వివరాలు, ప్రభుత్వం ఇచ్చే ఐడీ నెంబర్లు లాంటి వ్యక్తిగత సమాచారాన్ని చెప్పొద్దు.
- ఆన్లైన్లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింక్లపై అస్సలు క్లిక్ చేయకూడదు. ఫోన్లో అవసరం లేని యాప్స్ని ఇన్స్టాల్ చేయకూడదు. చేసినా.. పర్మిషన్లు ఇవ్వకూడదు.
- వీలున్న ప్రతి చోట టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇ–మెయిల్, బ్యాంకింగ్ లాంటి వాటికి రెండోసారి అథెంటికేషన్ చేయడం చాలా అవసరం.
- మీకు తెలియకుండానే ఎవరికైనా రిమోట్ యాక్సెస్ ఇస్తే.. తెలిసిన వెంటనే యాక్సెస్ తొలగించాలి. సాధ్యం కాకపోతే.. వెంటనే కంప్యూటర్, స్మార్ట్ఫోన్కు ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేయాలి.
- పర్సనల్, ఆర్థిక సమాచారం అడిగే కమ్యూనికేషన్లతో జాగ్రత్తగా ఉండాలి.
- సెన్సిటివ్ విషయాలను పంచుకునే ముందు అవతలి వాళ్లు ఎవరు? ఏంటనేది కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి.
- వాడుతున్న అన్ని డివైజ్ల్లో నమ్మదగిన సెక్యూరిటీ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి.
- ఏదైనా లావాదేవీ చేసే ముందు యూపీఐ హ్యాండిల్స్, వెబ్సైట్లను ఒకటికి రెండుసార్లు చెక్చేసుకోవాలి.