సోషల్​ మీడియా డీటాక్స్​ నుంచి బయటపడాలంటే.. 

సోషల్​ మీడియా డీటాక్స్​ నుంచి బయటపడాలంటే.. 

ఈరోజుల్లో పొద్దున లేవగానే సోషల్ మీడియా అప్​డేట్స్ చూడడం అలవాటుగా మారింది చాలామందికి. ఫేస్​బుక్, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​లో.. పోస్ట్ లేదా ఫొటో పెట్టి, దానికి ఎన్ని లైక్స్  వచ్చాయి? ఎంతమంది కామెంట్ చేశారు? అని పదే పదే చెక్ చేసుకుంటారు కొందరు. దాంతో, వాళ్లు డిప్రెషన్, యాంగ్జైటీకి లోనవుతారు. ఒక వారం రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే సోషల్​ మీడియా డీటాక్స్​ నుంచి బయట పడొచ్చు అంటున్నారు పరిశోధనలు చేస్తున్న రీసెర్చర్లు. 
‘సైబర్ సైకాలజీ బిహేవియర్ అండ్ సోషల్ నెట్ వర్కింగ్​’ అనే జర్నల్​లో వచ్చిన స్టడీ ఇదే చెప్తోంది. లండన్ ​లోని బాత్ యూనివర్సిటీ రీసెర్చర్లు  సోషల్ మీడియా డీటాక్స్ మీద  రీసెర్చ్ చేశారు. స్టడీ కోసం సోషల్ ​ మీడియాని ఎక్కువగా ఉపయోగించే 18 నుంచి 72 ఏండ్ల వయసు ఉన్న154 మందిని తీసుకుని రెండు గ్రూప్​లుగా చేశారు. ఒక గ్రూప్ వాళ్లని వారం రోజులు సోషల్ మీడియాకి దూరంగా,  రెండో గ్రూప్​ వాళ్లని వారానికి 8 గంటలు సోషల్ మీడియాలో ఉండేలా చూశారు. వారం తర్వాత  సోషల్​ మీడియాకి దూరంగా ఉన్నవాళ్లు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు గమనించారు రీసెర్చర్లు.