
- సేఫ్టీ ఓవర్వ్యూ ఫీచర్ను తెచ్చిన వాట్సప్
- 68 లక్షల ఖాతాలపై నిషేధం
న్యూఢిల్లీ: వాట్సప్ సేఫ్టీ ఓవర్వ్యూ పేరుతో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. యూజర్ కాంటాక్ట్లో లేని వారు ఎవరైనా కొత్త వాట్సప్ గ్రూప్లోకి చేరిస్తే హెచ్చరిస్తుంది. ఒక సేఫ్టీ ఓవర్వ్యూ స్క్రీన్ కూడా కనిపిస్తుంది.
యూజర్ ఆ గ్రూప్లోకి వెళ్లే ముందు, ఈ స్క్రీన్పై ఆ గ్రూప్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు కనిపిస్తాయి. గ్రూప్ పేరు, ఎవరు సృష్టించారో తెలుస్తుంది. ఆ గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో తెలుసుకోవచ్చు.
ఫిషింగ్, స్కామ్ల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై కొన్ని చిట్కాలను కూడా వాట్సప్ అందిస్తుంది. యూజర్లను మోసాల నుంచి రక్షించడంలో భాగంగా ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో స్కామ్ సెంటర్లకు సంబంధించిన 68 లక్షలకుపైగా ఖాతాలను గుర్తించి నిషేధించామని వాట్సప్ప్రకటించింది.