
ఖైరతాబాద్ వెలుగు: భర్త, అత్తామామల వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్య చేసు కుంది. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్కు చెందిన హలీమాబేగం(25) కు సిటీలోని బోరబండ స్వరాజ్నగర్కు చెందిన అబుల్ హాసిఫ్ (32) తో 2018 జూన్లో పెండ్లి అయ్యింది. వీరికి రెండున్నరేళ్ల కొడుకు అబ్దుల్ హబీబ్ ఉన్నాడు. లావుగా ఉన్నావని, అందంగా లేవని, రెండో పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్లుగా ఆమెను భర్త వేధిస్తున్నాడు. మరోవైపు అత్త బీబీ ఫాతిమా, మామ అబ్దుల్ జానీమియా సూటిపోటి మాటలు అంటున్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన హలీమాబేగం గురువారం ఉదయం తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పి, తీసుకెళ్లమని కోరింది. కొద్ది సేపటి తర్వాత ఆమెకు తల్లి ఫోన్చేయగా ఎత్తకపోవడంతో ల్యాండ్లైన్కు చేయగా, తోటికోడలు మాట్లాడి హలీమాబేగం ఉరేసుకుని చనిపోయిందని చెప్పింది. తల్లిదండ్రులు వచ్చి తమ కుమార్తె చావుకు భర్త, అత్తామామలే కారణమని ఎస్ఆర్నగర్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.