
సర్కార్కు కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా ప్రశ్నలు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించనుండటంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పరీక్షలపై ముందుకెళ్లడం ఏంటని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ఈ విషయంపై తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా స్పందించారు. 25 లక్షల మంది విద్యార్థుల హెల్త్, సేఫ్టీని రిస్క్లో పెట్టి ఎగ్జామ్స్ను నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
Health & safety of 25 lakh students is being jeopardised in the ensuing #JEE_NEET exams.
Students are protesting across the country.
Why is an obstinate Modi Govt even refusing to listen to their grievances, deliberate upon them and find a solution acceptable to all?
1/3— Randeep Singh Surjewala (@rssurjewala) August 26, 2020
ఎగ్జామ్స్ సమయంలో స్టూడెంట్స్కు కరోనా సోకబోదని మోడీ గవర్నమెంట్ హామీ ఇవ్వగలదా అని సూర్జేవాలా ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారో, ప్రోటోకాల్స్ పాటిస్తున్నారో చెప్పాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 6 వరకు జేఈఈ,13న నీట్ పరీక్షలు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో తగు జాత్రత్తల మధ్య ఈ ఎగ్జామ్స్ను నిర్వహించడానికి కేంద్రం సమాయత్తమవుతోంది.