- నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వైన్స్ షాపులకు 7677 అప్లికేషన్లు
- ఈ నెల 27 న లక్కీ డ్రా
నల్గొండ, వెలుగు: వైన్ షాపులకు దరఖాస్తులకు సర్కార్ గడువు పెంచిన ఆశించిన మేర ఆసక్తి కనిపించలేదు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో వైన్స్షాపులకు 7677 అప్లికేషన్లు వచ్చాయి గురువారం రాత్రి 9 గంటల వరకు అందిన సమాచారం మేరకు 247 షాపుల వచ్చిన ఆప్లికేషన్స్ వివరాలను అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం రెండు జిల్లాలలో 247షాపులకు 7,677 అప్లికేషన్స్ వచ్చాయి.
దీంతో సర్కార్కు రూ.230.31 కోట్ల ఆదాయం వచ్చిం ది. నల్గొండ జిల్లాలో 154 షాపులకు 4,906, సూర్యాపేటలో 93 షాపులకు 2,771 అప్లికేషన్స్ వచ్చాయి. అత్యధికంగా కనగల్ మండలం దర్వేశిపురం షాపుకు 154 అప్లికేషన్స్ వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో చిలుకూరు మండలం బేతవోలు షాపుకు 59, అత్యల్పంగా తిరుమలగిరి షాపుకు 18 వచ్చాయి.
యాదాద్రిలో 2776 అప్లికేషన్
యాదాద్రి, వెలుగు: వైన్స్ షాపులకు గతం కంటే అప్లికేషన్లు తగ్గినా ఇన్కం మాత్రం పెరిగింది. 18 నాటికి 2647 అప్లికేషన్లు వచ్చాయి. అయితే తక్కువగా వచ్చాయన్న ఉద్దేశంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ నెల 23 వరకూ గడువు పొడిగించడంతో 129 అప్లికేషన్లు పెరిగి 2776కు చేరింది.
