
- టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాపోలు రాములు
మేడిపల్లి, వెలుగు: మంత్రి మల్లారెడ్డి అండతో పీర్జాదిగూడ మున్సి పల్ కార్పొరేషన్ లో ప్రభుత్వ పార్కు స్థలాలు, బఫర్ జోన్, నాలాలు, సీలింగ్ భూములతో పాటు శ్మశాన వాటికలను కూడా కబ్జా చేసి అమ్ముతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాపోలు రాములు ఆరోపించారు. కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి వెంచర్ చేసి పక్కనే ఉన్న సమాధులను కూడా కబ్జా చేసి రాత్రికి రాత్రే నిర్మాణాలు చేశారన్నారు. ఆదివారం తన ఇంట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్తామన్నారు.