ఇంతే ఇంత మ్యాగీ.. 200 రూపాయలా.. దేంతో వండారేంటీ..?

ఇంతే ఇంత మ్యాగీ.. 200 రూపాయలా.. దేంతో వండారేంటీ..?

 ఓ ట్విట్టర్​ యూజర్​ షేర్​ చేసిన మసాలా మ్యాగీ న్యూడిల్స్​ కొనుగోలు ఇన్​వాయిస్​ చిత్రం  సోషల్​ మీడియాలో చర్చకు దారితీసింది. ఎయిర్​ పోర్టులో ఓ చిన్న మ్యాగీ కొన్న సెజల్​ సుద్​ అనే కస్టమర్​.. ధరలపై అసహనం వ్యక్తం చేస్తూ ఇన్​ వాయిస్​ పోస్ట్​ చేసింది. చాలాచోట్ల రూ. 50లు ఉండే మ్యగీకి ఎయిర్ పోర్టులో 193రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కస్టమర్లనుంచి వసూలు చేస్తున్నారు.. దీనిపై ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు అని పోస్ట్​ చేసింది. ఎవరైనా మ్యాగీ లాంటి వాటిని ఇంత ఎక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తారు’ అని సెజల్​ సుద్​ ఆవేదన వ్యక్తం చేసింది. 

ALSOREAD :సఫాయి కార్మికుడి అవతారం ఎత్తిన మరో సర్పంచ్

సెజల్​ సుద్​ పోస్ట్​పై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఈమ్యాగీ విమాన ఇంధనంతో తయారు చేసిందా ఏంటీ ’’ అంటూ వ్యంగ్యంగా రీట్వీట్​ చేశారు. ‘‘బహుశా మీరు ఎయిర్​ పోర్టులో కొనుగోలు చేసిన అతి తక్కువ ధర వస్తువు మ్యాగీ అయి ఉండొచ్చు’’ అంటూ మరో నెటిజన్​ ట్వీట్​ చేశాడు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ అధికారులు స్పందించి ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని కోరారు.  ‘‘ఇండిగో విమానాల్లో కూడా మ్యాగీ రూ. 250లకు విక్రయిస్తున్నారు. రేట్లపై పరిమితి విధించాలి’’ అంటూ మరో నెటిజన్​ ట్వీట్​ చేశాడు. అయితే ఓ నెటిజన్​ స్పందిస్తూ.. ‘‘ మ్యాగీ ధర రూ. 50 లే అయినప్పటికీ ఎయిర్ పోర్ట్​లో దీనిని విక్రయించేందుకు డబ్బు చాలా ఖర్చు అవుతుంది.. 5 స్టార్​ హోటళ్లలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకే మీరు  ఈసారి ఎయిర్ పోర్టుకు వెళ్లినప్పుడు టిఫిన్ కట్టుకొని వెళ్లండి” అంటూ హాస్యంగా స్పందించాడు. అయితే ఎయిర్​ పోర్టు అధికారులు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.