సఫాయి కార్మికుడి అవతారం ఎత్తిన మరో సర్పంచ్

సఫాయి కార్మికుడి అవతారం ఎత్తిన మరో సర్పంచ్

సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు కార్మికుడి అవతారమెత్తారు. గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ చెత్తను సేకరించారు. గ్రామ సర్పంచే సఫాయి కార్మికుడిగా మారి చెత్తను సేకరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గంభీరావుపేట మండల కేంద్రంలో పారిశుధ్య కార్మికులు సమ్మె చేపట్టడంతో గ్రామంలో చెత్త చెదారం పేరుకుపోయింది. గ్రామంలో మనుషులకు విష జ్వరాలు, డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా చెత్తను సేకరించారు సర్పంచ్. 

ALSOREAD :కిలో వెండి ల‌క్ష రూపాయ‌లు అవుతుందా.. ఇప్పుడెంత‌?