దేశ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పది: జీహెచ్ఎంసీ డిప్యూటీ

దేశ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పది: జీహెచ్ఎంసీ డిప్యూటీ

ఉప్పల్/పద్మారావునగర్, వెలుగు:  దేశ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా గొప్పదని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతశోభన్​రెడ్డి అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు తిరుగులేని నాయకత్వాన్ని పోషిస్తున్నారని చెప్పారు. శనివారం నాచారంలోని సెయింట్​పియూస్ ఎక్స్ డిగ్రీ, పీజీ విమెన్స్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో శ్రీలతప పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో మహిళల ప్రాధాన్యతను వివరించారు. 

కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ అల్ఫోన్స్, ప్రిన్సిపల్ డాక్టర్ వేలంగిని కుమారి, ఇన్​చార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుష్మ, స్టూడెంట్లు తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని గాంధీనగర్ ఇన్​స్పెక్టర్ రాజు చెప్పారు. బన్సీలాల్ పేట చాచా నెహ్రూనగర్​ రెయిన్ బో హోమ్స్​ఆధ్వర్యంలో శనివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. సమర్థంగా ఇంటిని నిర్వహించే మహిళలు, నేడు దేశానికి సారథ్యం వహించే స్థాయికి చేరుకున్నారన్నారు. కార్పొరేటర్​ కె.హేమలత, రెయిన్​ బో హోమ్స్ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ అనురాధ, బస్తీ మహిళలు పాల్గొన్నారు.