ఈకేవైసీ కోసం బారులు తీరిన మహిళలు

ఈకేవైసీ కోసం బారులు తీరిన మహిళలు
  • గ్యాస్ లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులు

మెదక్ టౌన్, వెలుగు:  వంద రోజుల్లో గ్యాస్ సిలిండర్‌‌‌‌‌‌‌‌ రూ. 500 కే అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ కోసం లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. మంగళవారం మెదక్​ పట్టణంలోని గ్యాస్​ ఏజెన్సీల వద్ద పెద్ద సంఖ్యలో  ఈ-కేవైసీ కోసం మహిళలు మంగళవారం క్యూలో నిలుచున్నారు. 

 పట్టణంలోని ఫతేనగర్‌‌‌‌‌‌‌‌లోని భారత్​ గ్యాస్​ ఏజెన్సీ, హెచ్​పీ గ్యాస్​ ఏజెన్సీల వద్ద ఆఫీసులు తెరవక ముందే ఉదయం 7 గంటల నుంచి వారి ఆధార్​ కార్డులు, గ్యాస్​ పుస్తకాలను తీసుకొని వచ్చి  లైన్లో  వేచి ఉన్నారు.  ఒక్కో గ్యాస్​ ఏజెన్సీ వద్ద సుమారు 300  మంది నుంచి 500 మంది వరకు మహిళా లబ్ధిదారులు బారులు తీరారు.  ఆయా గ్యాస్​ ఏజెన్సీల నిర్వాహకులు ఒక్కొక్కరిని పిలిచి వారి ఆధార్​కార్డుల తదితర వివరాలను పరిశీలించి ఫింగర్​ ప్రింట్​ (తంబ్​) తీసుకున్నారు.  మంగళవారం సాయంత్రం వరకూ లైన్‌‌‌‌లో ఉన్న వారి నుంచి ఫింగర్​ ప్రింట్​(తంబ్​ ఇంప్రెషన్​) తీసుకున్నారు. 
 

శివ్వంపేట,  వెలుగు: ఈ కేవైసీ కోసం మండలంలోని వివిధ గ్రామాల గ్యాస్​ వినియోగ దారులు శివ్వంపేట మండల కేంద్రంలోని వెంకట రమణ భారత్ గ్యాస్ ఏజెన్సీ ముందు మంగళవారం బారులు తీరారు.  రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు.  కానిస్టేబుల్​లు ఈ కేవైసీ కోసం వచ్చిన వారిని క్యూలో నిలబెడుతూ జాగ్రత్తలు తీసుకున్నారు.