వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ కు క్వాలిఫై అయ్యింది. కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించడానికి నిర్వహించిన పోటీల్లో హర్యానాకు చెందిన మీనాక్షిపై నిఖత్ గెలుపొందింది. పవర్ఫుల్ పంచులతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి... 7-0 తేడాతో మ్యాచ్ గెలుపొందింది. ప్రత్యర్థి ఆమెపై ఒక్క పంచ్ కూడా వేయలేదు. ఈ విజయంతో నిఖత్ జరీన్ బర్మింగ్ హామ్ లో జరగనున్న కామెన్వెల్త్ క్రీడల్లో పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఆమెతోపాటు ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహెయిన్ కూడా కామన్వెల్త్ క్రీడల్లో అర్హత సాధించింది. అలాగే జాస్మిన్ (60కేజీల విభాగం), నీతూ(48 కేజీల విభాగం)లో అర్హత సాధించారు. దీంతో నిఖత్ జరీన్ మరోసారి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేయనుంది.
CWG, Here I come. Representing India at the highest level is a dream for every athlete.?
— Nikhat Zareen (@nikhat_zareen) June 11, 2022
Lets go! ? @birminghamcg22 #CWG2022 pic.twitter.com/RdisTJSaDW