ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కరోనా కేసులు
  • ఇప్పటివరకూ 87 వేల మందికిపైగా మృత్యువాత

పారిస్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ సోకిన వారి సంఖ్య 15 లక్షలు దాటింది. గురువారం ఉదయం వరకూ ప్రపంచవ్యాప్తంగా వైరస్​ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 15,02,478గా నమోదయ్యింది. ఇదే సమయంలో 192 దేశాల్లో 87,320 మంది కరోనా వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్​ చివరి వారంలో చైనాలోని వూహాన్ లో తొలి కరోనా కేసు నమోదైంది. మూడు నెలల్లో ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమైంది. చైనాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చినా.. యూరోప్ దేశాలు, అమెరికాలో దాని ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అమెరికాలో పాజిటివ్​ కేసుల సఖ్య 4,32,132గా నమోదు కాగా.. 14817 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు. ఇక స్పెయిన్​లో 1,46,690 మందికి పాజిటివ్​ రాగా.. 14,555 మంది చనిపోయారు. ఇటలీలో 1,39,422 మందికి వైరస్​ సోకగా.. 17,669 మంది ప్రాణాలు కోల్పోయారు. యూరోప్​లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 7,72,592 ఇక్కడివే. అలాగే 61,118 మంది మరణాలు కూడా ఇక్కడే సంభవించాయి.