
- కలెక్టర్ హనుమంతరావు
- మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశం
ఆలేరు (యాదాద్రి), వెలుగు: మెనూ పాటించకుండా స్టూడెంట్స్కు నీళ్ల పప్పుచారుతో భోజనం పెట్టడంపై యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు సీరియస్ అయ్యారు. నీళ్ల చారుతో పిల్లలు భోజనం ఎలా తింటారని నిలదీశారు. జిల్లాలోని శారాజీపేట హైస్కూల్ను మధ్యాహ్న భోజనం సమయంలో సందర్శించారు. స్టూడెంట్స్ కోసం వండిన పదార్థాలను ఆయన పరిశీలించారు. కూరలకు బదులుగా చారుతోనే భోజ నం ఏర్పాటు చేసిన ఏజెన్సీపై ఆయన సీరియస్ అయ్యారు.
నీళ్లచారుతో పిల్లలు ఎలా భోజనం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. అనంతరం టెన్త్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కు ఇప్పటి నుంచి స్పెషల్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. ఆలేరులోని పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ను పరిశీలించారు.
ప్లానింగ్తో వడ్ల కొనుగోలు చేయండి
యాదాద్రి, వెలుగు: ప్లానింగ్ ప్రకారం వడ్ల కొనుగోలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. కలెక్టరేట్లో వడ్ల కొనుగోలులపై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కొనుగోలు సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు వివరించారు. తేమ, తాలు పర్సేంటేజీ ఎంత ఉండాలో తెలిపారు. పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా కొనుగోళ్లు నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మీటింగ్లో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్డీవో నాగిరెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం హరికృష్ణ, డీసీఎస్వో రోజారాణి, డీఏవో వెంకట రమణారెడ్డి, డీసీవో శ్రీధర్ ఉన్నారు.