- చౌటుప్పల్లో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 104 వార్డుల్లో 264 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో కొందరు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున 70 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ తరపున 101 దాఖలు కాగా బీఆర్ఎస్ తరపున 90 దాఖలయ్యాయి.
సీపీఎం తరఫున 3, రిజిస్టర్డ్ పార్టీల తరఫున 10, ఇండిపెండెంట్లు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో బుధవారం 41 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఆలేరు మున్సిపాలిటీలో సీపీఎం, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదుర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆలేరులో 12 వార్డులు ఉండగా సీపీఎం నాలుగో వార్డుల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్వద్ద ప్రతిపాదన చేసింది.
ఆ వార్డులో తమ అభ్యర్థిని ఇప్పటికే ఎంపిక చేశామని డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. కలిసి వస్తే కో ఆప్షన్ పదవిఇస్తామని ప్రపోజల్ చేసినట్టుగా చెబుతున్నారు. అయితే సీపీఎం మాత్రం ప్రతి మున్సిపాలిటీలో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని, తాము పోటీ చేస్తామని తెలిపింది. ఈ విషయంలో రెండు పార్టీల్లో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.
చౌటుప్పల్లో బీఆర్ఎస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. సీపీఎం మూడు వార్డుల్లో పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ 17 వార్డుల్లో పోటీ చేస్తోంది. ఒంటరిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ 20 వార్డుల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ ఇప్పటివరకూ 7 వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసింది. భువనగిరిలో 22 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్, పోచంపల్లిలో 9 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
