యాదగిరిగుట్ట ఎలక్ట్రికల్ ఈఈ రామారావు సస్పెన్షన్

యాదగిరిగుట్ట ఎలక్ట్రికల్ ఈఈ రామారావు సస్పెన్షన్

యాదాద్రి భువనగిరి: అవినీతి, లంచం కేసులో ఏసీబీకి చిక్కిన యాదగిరి గుట్ట ఎలక్ట్రికల్​ఈఈ రామారావుపై సస్పెన్షన్​ వేటు పడింది. విధుల నుంచి తొలగిస్తూ  శుక్రవారం(అక్టోబర్31) ఆలయ ఇంఛార్జ్​ ఈవో హరీష్​ ఉత్తర్వులు జారీ చేశారు. 

తంలో అవుట్ సోర్సింగ్​ ఉద్యోగాల్లో అవకతవకలకు పాల్పడినందుకు 2024 ఆగస్టులో కూడా సస్పెండ్ అయ్యారు రామారావు. సస్పెన్షన్​ కు గురై తిరిగి విధుల్లో చేరిన ఆరునెలల్లో నే మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీంతో రామారావుపై సస్పెన్షన్​ వేటు వేశారు ఆలయ ఇంఛార్జ్​ ఈవో. 

ఏడాది వ్యవధిలోనే రెండు సార్లు సస్పెండ్​ అయిన ఈఈ రామారావు తొలగించి ఆయన ప్లేస్​ లో ఎలక్ట్రికల్​ ఈఈగా పనిచేస్తున్న దయాకర్​ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు ఇంఛార్జ్​ ఈవో హరీష్​.