ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తా

ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తా

YCP MLA రోజాకు ఇండిగో విమానం చుక్కలు చూపించింది.   రాజమండ్రి నుంచి రోజా ఇండిగో విమానంలో తిరుపతికి బయల్దేరారు రోజా. అదే విమానంలో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. ఆ  విమానంలో టెక్నికల్  సమస్యలు తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు.

బెంగళూరు మళ్లించి అక్కడ గంటపాటు విమానాన్ని గాల్లోనే తిప్పారు. ఆ తర్వాత ల్యాండ్ చేసినప్పటికీ ఎవరూ విమానం నుంచి కిందకు దిగకుండా డోర్లు మూసివేశారు. ఈ ఘటనపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందన్నారు. నాలుగు గంటల పాటు తమను విమానంలోనే కూర్చోబెట్టారని... బెంగళూరులో విమానం నుంచి దిగాలనుకున్న వారు రూ. 5 వేలు ఇవ్వాలని ..ఇస్తేనే దించుతామని ఇండిగో సిబ్బంది  డిమాండ్ చేశారని తెలిపారు.  తమను  ఇబ్బందులకు గురిచేసిన  ఇండిగో సంస్థపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు ఎమ్మెల్యే రోజా.