YCP MLA రోజాకు ఇండిగో విమానం చుక్కలు చూపించింది. రాజమండ్రి నుంచి రోజా ఇండిగో విమానంలో తిరుపతికి బయల్దేరారు రోజా. అదే విమానంలో టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. ఆ విమానంలో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు.
బెంగళూరు మళ్లించి అక్కడ గంటపాటు విమానాన్ని గాల్లోనే తిప్పారు. ఆ తర్వాత ల్యాండ్ చేసినప్పటికీ ఎవరూ విమానం నుంచి కిందకు దిగకుండా డోర్లు మూసివేశారు. ఈ ఘటనపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందన్నారు. నాలుగు గంటల పాటు తమను విమానంలోనే కూర్చోబెట్టారని... బెంగళూరులో విమానం నుంచి దిగాలనుకున్న వారు రూ. 5 వేలు ఇవ్వాలని ..ఇస్తేనే దించుతామని ఇండిగో సిబ్బంది డిమాండ్ చేశారని తెలిపారు. తమను ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో సంస్థపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు ఎమ్మెల్యే రోజా.